మెదక్ జిల్లా
కాంగ్రెస్ మైనార్టీ వైస్ చైర్మన్గా షేక్ అలీని నియమించారు. మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నియామక పత్రం అందించి, శాలువాతో సన్మానించారు. పార్టీలో కష్టపడ్డ వారికి తగిన స్థానం దక్కుతుందని ఆంజనేయులు గౌడ్ తెలిపారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానని షేక్ అలీ హామీ ఇచ్చారు.