చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థిని, పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ఆశించిన మార్కులు రాకపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.