సంగారెడ్డి: ఎలుకల మందు తాగి పారిపోయాడు!

క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న అనిల్ (28) అనే ఆటో డ్రైవర్ పటాన్చెరు జేపీ కాలనీలోని తన నివాసంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెట్టింగ్ నష్టంతో మద్యం తాగి భార్యతో గొడవపడిన అతను, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. పోలీసులు వచ్చేలోపే పారిపోయిన అనిల్ను, అరగంట తర్వాత అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
