ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని, అన్ని శాఖల పథకాల అమలు వివరాలను ప్రజలతో పంచుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో మాట్లాడుతూ, గ్రామసభల కోసం పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని, గ్రామాల వారీగా పథకాల వివరాలను సిద్ధం చేసి మండల ఎంపీడీవోలకు పంపాలని సూచించారు.