సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో శుక్రవారం చెక్ డ్యాం వద్ద సుమారు ఏడు అడుగుల కొండచిలువ కనిపించడంతో స్థానిక రైతులు భయాందోళనలకు గురయ్యారు. పంట పొలాలకు వెళ్లే దారిలో కొండచిలువ సంచారంతో ఆందోళన చెందుతున్న రైతులు, మరిన్ని కొండచిలువలు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టాలని వారు కోరుతున్నారు.