గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు అన్నారు. ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమాన్ని సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళ్ళకుంట కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు.