సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయించారు. పాఠశాల సమస్యలను దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.