సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 8వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలంలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసివేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై కూడా మే 23 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని సూచించారు.