సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి, గంగిరేణి చెట్టు వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.