సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టి, బోనాలు సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మల్లన్న నామస్మరణతో ఆలయం మార్మోగింది.