భూ సమస్యల పరిష్కారం దిశగా ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేలా భూభారతి లాంటి చారిత్రాత్మక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని అన్నారు.