సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి ప్రజల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు ప్రజావాణి కార్యక్రమంపై ఎంతో నమ్మకం ఉంచుతారని, ప్రతి దరఖాస్తును శ్రద్ధగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 154 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి.