ఉద్యోగ విరమణ పొంది రెండేళ్లు గడిచినా ప్రభుత్వం తమకు రావాల్సిన జీపీఎఫ్, జీఐఎస్, ఇఎల్ఎస్, గ్రాట్యూటీ వంటి ప్రయోజనాలను చెల్లించడం లేదని సామాజికవేత్త బక్క జడ్సన్ ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు భారీగా పెండింగ్ లో ఉన్నాయని, దీనిని నిరసిస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో తెలిపారు.