సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రెగ్యులర్గా బదిలీ చేయడం వల్ల పరిపాలన కుంటుపడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేవలం ఆరు నెలలకే హెచ్ఓడీలను బదిలీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ బదిలీల వల్ల ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేయడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.