సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం కూటిగల్ లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో దొడ్డిలో ఉన్న గొర్రెలపై పిడుగు పడటంతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. నిరుపేద కుటుంబానికి జీవనాధారమైన ఈ గొర్రెల నష్టం తీరని లోటు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.