సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2026–27 ఉగాదికి తెలుగు పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. జిల్లా శాఖ పనితీరును కూడా ఆయన ప్రశంసించారు.