సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా రవాణా భద్రత దృష్ట్యా 18 ఏళ్ల లోపు మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు.