సిద్దిపేట పట్టణంలోని లింగారెడ్డిపల్లిలో ఆదివారం విద్యుత్ షాక్తో 15 మేకలు మృతి చెందాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, బాధితులైన గొర్రెల కాపరులను ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన బాధితులను పరామర్శించి, నష్టపరిహారం అందించాలని కోరారు.