సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం ఆర్డీవోలు, తహసిల్దార్లతో సమావేశమై రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ భూముల సంరక్షణ సక్రమంగా చేయాలని ఆదేశించారు. గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా రెవెన్యూ అంశాలపై సమీక్షించిన కలెక్టర్, ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థ ప్రాముఖ్యతను, భూ సమస్యలు ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఒకటని నొక్కి చెప్పారు.