పంక్చర్ షాప్కు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరిన అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్కు చెందిన ఆరుగొండ నాగార్జున(35) రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. శనివారం మధ్యాహ్నం పెద్ద చెరువులో అతని మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించారు. కాలకృత్యాల కోసం వెళ్లినప్పుడు కాలుజారి చెరువులో పడి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.