హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500లో పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో డెన్మార్క్కు చెందిన లినే
క్రిస్టోఫెర్సెన్ చేతిలో తొలి రౌండ్లోనే సింధు పరాజయం పాలైంది. గతంలో ఐదుసార్లు లినేపై గెలిచినా ఈసారి 21-15, 16-21, 19-21తో ఓడింది. ఇక పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ రెండో రౌండ్కు అర్హత సాధించారు.