బిహార్ శాసనసభ ఎన్నికల్లో 25 ఏళ్ల జానపద గాయని మైథిలీ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ తరఫున అలీనగర్ శాసనసభ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసి సుమారు 12వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 84,915 ఓట్లు రాగా, 11,730 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతి చిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు. గతంలో బిహార్ ఎన్నికల కమిషన్ తరఫున 'స్టేట్ ఐకానిక్'గా, రాష్ట్ర సాంస్కృతిక అంబాసిడర్గానూ గుర్తింపు పొందిన మైథిలీకి 2021లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం లభించింది.