జెకెఎఐ షోటోకాన్ కరాటే అసోసియేషన్ మెట్పల్లి మండల ప్రధాన శిక్షకులు వంశీ నాయుడు అధ్వర్యంలో బెల్ట్ పరీక్షా కార్యక్రమం జిల్లా ప్రధాన శిక్షకులు, పరీక్షా నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ పర్యవేక్షణలో మెట్ పల్లి లో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ప్రథమ స్థానంలో హర్శిని, ద్వితీయ స్థానంలో శ్రికృప, తృతీయ స్థానంలో గ్రీష్మ లు ప్రతిభ కనబర్చినారు.