
రాష్ట్రస్థాయి ఖో- ఖో పోటీలకు విద్యార్థి ఎంపిక
ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఖోఖో పోటీలకు పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని పంబాల అశ్విత ఎంపికయ్యారు. ఈనెల 28 నుండి 30 వరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలకు అస్మిత ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వేల్పుల సురేందర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం, ఉపాధ్యాయులు అభినందించారు.








































