రాజన్న సిరిసిల్లలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా, ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాలతో భరోసా కేంద్రం ఎస్ఐ వీనిత రెడ్డి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి ట్రైబల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యార్థినులకు భరోసా సేవలు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధం, సైబర్ నేరాలు, సైబర్ స్టాకింగ్, హెల్ప్లైన్ 1098, 1930లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుళ్లు ప్రవళిక, శిరీష, సిబ్బంది మల్లీశ్వరి, స్వాభావతి, పవనిత పాల్గొన్నారు.