వర్షాకాలం దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ తహశీల్దార్లను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో వరదలు, రోడ్లు, వంతెనల నష్టం, పంటలు దెబ్బతినడం, ఇళ్లు కూలిపోవడం, పశు, మానవ నష్టాల వివరాలను వెంటనే సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు. చెరువులు, రిజర్వాయర్లు పొంగిపొర్లే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.