జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అసరి బాల్ రాజ్ యాదవ్ నేతృత్వంలోని బృందం ప్రజలను గడపగడపకు వెళ్లి కలుసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కాంగ్రెస్ విజయమే ప్రజల అభివృద్ధికి మార్గమని బాల్ రాజ్ యాదవ్ తెలిపారు.