కాంగ్రెస్ పార్టీ జన్నారం మండలం జడ్పీటీసీ మాజీ సభ్యుడు భక్షి నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా పంచాయతీ ఎన్నికల వేళ కీలక నేత చేరిక బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశమని చెప్పవచ్చు.