రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్పోస్టు వద్ద, పంచాయతీ ఎన్నికల మోడల్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని ఎన్నికల అధికారులు ఆపి తనిఖీ చేశారు. అధికారులు చేసిన ఈ తనిఖీకి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూర్తిగా సహకరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.