రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, ఆయిల్ పామ్ సాగు ప్రాధాన్యం, లాభాలు, విధానంపై రైతులకు వివరించారు. పంట మార్పిడితో పాటు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు, దీని ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు. భవిష్యత్తులో రైతుల ఆర్థికాభివృద్ధికి ఈ పంట కీలకమని పేర్కొన్నారు.