వేములవాడ భీమేశ్వరాలయం వద్ద భక్తుల రద్దీని తగ్గించేందుకు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. పార్వతీపురం వెనుకవైపు వీఐపీ రోడ్డులో ఏర్పాటు చేసిన కొత్త క్యూ లైన్ నటరాజ విగ్రహం కూడలి వద్ద రాకపోకలకు అంతరాయం కలిగించడంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీంతో భక్తుల ఇబ్బందులు తొలగిపోయాయి.