సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ యాక్ట్ 1861ను డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రకటించారు. ఈ కాలంలో పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు నిర్వహించరాదని, డీజే వినియోగం నిషేధమని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చర్యలు చేపట్టరాదని ఆయన హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.