సిరిసిల్ల కొత్త బస్టాండ్ వాష్రూమ్లో కొద్ది రోజుల క్రితం గుర్తించిన నవజాత శిశువును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ICPS, CWC, సఖి టీమ్ పర్యవేక్షణలో పాప బరువు 1500 గ్రాముల నుంచి 2700 గ్రాములకు పెరిగింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది. తల్లిదండ్రుల కోసం కేసు నమోదు చేసినా ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు చిన్నారికి బారసాల చేసి 'ఆదర్శిని'గా నామకరణం చేసి కరీంనగర్ శిశుగృహానికి తరలించారు.