వరి పైరు కోతకు సిద్ధంగా ఉండగా, తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన పంట నీట మునిగి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరో రెండు రోజులపాటు తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.