వేములవాడ రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు లక్ష రూపాయల విరాళం

0చూసినవారు
వేములవాడ రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు లక్ష రూపాయల విరాళం
హైదరాబాద్ వాస్తవ్యులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TNGOs) కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్, మాలతి దంపతులు కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) విరాళం అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు సంజీవ్ కుమార్ కు ఈ విరాళాన్ని అందజేశారు. వారి వెంట సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్