రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఏడుకొండలు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో రాష్ట్ర గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏడుకొండలుకు గవర్నర్ ప్రెస్ సెక్రటరీ అభినందనలు తెలియజేశారు.