వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ పరిసరాల్లో ఆదివారం సాయంత్రం భారీ నాగుపాము కనిపించడంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ జగదీష్ను సంప్రదించగా, ఆయన హుటాహుటిన చేరుకొని చాకచక్యంగా నాగుపామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ప్రస్తుతం రాజన్న ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.