వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తీక మాస రెండవ సోమవారం సందర్భంగా సోమవారం రాత్రి మహా లింగార్చన పూజను అర్చక స్వాములు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు చేశారు. రాజన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.