రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో, కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పట్టణ సెస్ అధికారులు ఐరన్ పోల్స్ స్థానంలో సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేస్తున్నందున ఈ ఆటంకం నెలకొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (బ్యాంక్ ఆఫ్ బరోడా) ప్రాంతంలో నూతన సిమెంట్ పోల్స్ అమరికతో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది.