వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో నిత్య కళ్యాణం జరుగుతోందని భక్తులు తెలిపారు. ప్రత్యేక రోజులు మినహా, ప్రతిరోజూ రూ. 1500/- టికెట్ కొనుగోలు చేసిన దంపతులకు అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపిస్తారు. అనంతరం వారికి స్వామివారి లడ్డు ప్రసాదంతో పాటు కండువా, చీరను అందజేస్తామని అర్చక స్వాములు వెల్లడించారు.