రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పనులను స్వయంగా పరిశీలించి, అధికారులకు సూచనలు అందించారు. ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ పనుల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు.