బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో వీధి కుక్క దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నక్క కావ్య, పిల్లి అపర్ణిక అనే చిన్నారులు ఇంటిముందు ఆడుకుంటుండగా కుక్క వారిపై దాడి చేసింది. అదే సమయంలో తీర్థాల కనకయ్యపై కూడా కుక్క దాడి చేసి గాయపరిచింది. స్థానికులు గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్, వేములవాడ ఆసుపత్రులకు తరలించారు.