AP: అనకాపల్లి జిల్లా పూడిమడక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సొంత అన్నను చెల్లి రాయితో కొట్టి చంపేసింది. ఇంటి స్థలం కోసం ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కోపంతో అన్న నూకరాజును చెల్లి కోర్లమ్మ రాయితో కొట్టి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.