TG: మాజీ సీఎం కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. ఎర్రవల్లి ఫామ్హౌస్లో విచారణ జరపాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. నందినగర్ నివాసంలో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.