తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వేడిని పెంచుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్, తాజాగా పార్టీ అధినేత కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేసింది. సిట్ నంది నగర్ నివాసంలో ఇంటి గోడకు నోటీసులు అతికించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నంది నగర్లోని నివాసంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఎర్రవల్లి ఫాంహౌస్లో విచారణకు సిట్ నిరాకరించింది. అధికారిక రికార్డుల మేరకే నంది నగర్ ఇంట్లోనే విచారణ జరుగుతుందని తెలిపింది.