స్మార్ట్ టీవీలలోని ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగదారుల గోప్యతకు భంగం కలిగిస్తోందని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇతరులకు పంపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామ్సంగ్, ఎల్జీ వంటి కంపెనీల టీవీలు ల్యాప్టాప్కు కనెక్ట్ చేసినప్పుడు కూడా డేటాను సేకరిస్తున్నాయని అమెరికాలో జరిగిన పరిశోధనలో వెల్లడైంది. '63శాట్స్ సైబర్ టెక్' సీఈఓ నీహార్ పఠారే మాట్లాడుతూ, టీవీ హార్డ్వేర్ నేరుగా పిక్సెల్స్ను గుర్తించి, సున్నితమైన డాక్యుమెంట్ల వివరాలు కూడా టెక్నాలజీ గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.