AP: మనం ఇప్పటివరకు ఎన్నో రకాల చేపలను చూసి ఉంటాం. పామును పోలిన చేపల్ని ఎప్పుడైనా చూశారా? కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద కృష్ణా నదిలో వేలాదిగా దర్శనమిచ్చాయి. వీటిని ఈల్ జాతి చేపలు అంటారు. ఇవి నీటిలో ఈదడంతో పాటు నేల మీద కూడా పాకగలవు. ఇంతకీ అన్ని చేపలు కృష్ణా నదిలోకి ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారదు. మత్స్యకారుల వలలో ఈ చేపలు భారీగా పడుతున్నాయి.