భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో సఫారీ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో ఛేదించింది. మార్క్రమ్(110) సెంచరీతో, మాథ్యూ(68), బ్రెవిస్(54) అర్ధశతకాలతో రాణించారు. కెప్టెన్ బవుమా 46 పరుగులు చేశారు. చివర్లో బాష్(26) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్, ప్రసిద్ధ్ రెండేసి.. హర్షిత్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.