గువాహటిలో రెండో టెస్టు మ్యాచ్ నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యంలో ఉంది. 26/0తో ప్రారంభించిన సఫారీలు టీ బ్రేక్ సమయానికి 107/3 స్కోర్ చేశారు. మొత్తం ఆధిక్యం 395 పరుగులు. క్రీజులో స్టబ్స్ (14*), డీ జోర్జి (21*) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 489 రన్స్, భారత్ 201కి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.