గువాహటిలో టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటలో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా సాగుతోంది. 247/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీలు, ఏడో వికెట్కు 37 పరుగులు జోడించారు. ప్రస్తుతం 97 ఓవర్లకు 283/6 స్కోర్తో బ్యాటింగ్ చేస్తున్నారు. ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ టెంబా బవుమా (41) రాణించారు. ముత్తుసామి (40*), కైల్ వేరియన్ (21*) క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లు వికెట్ల కోసం శ్రమిస్తున్నారు.